ద్విపదభాగవతం - మధురకాండ : ప్రభాసతీర్థమందు మునిఁగి చనిపోయిన కుమారుని తెచ్చిపెట్టమని శ్రీకృష్ణుని గర్గ్యుఁడు కోరుట
“తనర ప్రభాసతీర్థములోనఁ దొల్లి
మునిగిపోయిన పుత్రు మొగిఁ దెచ్చియిమ్ము
vడిది దుష్కరపు కార్య మిటుసేయుఁ” డనిన
యగుఁ గాకయని ప్రీతి హలియును దాను
నగణితాయుధపూర్ణమగు రథం బెక్కి